ఒక కుటుంబంలోని వ్యక్తి చెడుదారి పడితే కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ వ్యక్తిని మార్చుకోవాలని చూస్తారు.కానీ కుటుంబం కూడా అదే దారి పడితే.
ఊహించుకోవడానికే బాగా లేని ఈ ఆలోచనను ఓ కుటుంబం ఆచరణలో పెట్టింది.దీంతో ఆ కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి పంపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.హైదరాబాద్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరపగా వారు అవాక్కయ్యే వివరాలు తెలిపింది.
తన కుటుంబంలోని సభ్యులందరూ చోరకళనే తమ వృత్తిగా ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చింది.రద్దీ బస్సులు, ఒంటరి మహిళలు, చిన్నారులే తమ టార్గెట్గా ఈ దొంగ ఫ్యామిలీ దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపింది.
బెంగుళూరుకు చెందిన ఈ ముఠా కొంతకాలంగా హైదరాబాద్ను అడ్డాగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.గాయత్రి, ఆమె భర్త రాజు, సోదరి కోకిల, వదిన వనితతో పాటు మరికొంత మంది కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు ఆమె తెలిపింది.
ఈ కుటుంబానికి రాజు ప్లానింగ్ మాస్టర్గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.దీంతో ఆరుగురు కుటుంబ సభ్యులున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా మరికొంత మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.