ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో క్షణక్షణానికి రాజకీయ వాతావరణంలో పెద్ద వాతావరణాన్ని తలపిస్తోంది.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉంటే మరోపక్క ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే మరో పక్క ప్రతిపక్ష పార్టీ టిడిపి పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అరెస్టులకు దారితీస్తుంది.
మేటర్ లోకి వెళ్తే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం నిమ్మాడలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని భయబ్రాంతులకు గురి చేస్తూ నామినేషన్ వేయకుండా దాడికి పాల్పడడంతో ఆటో బెదిరింపులకు దిగుతూ ఫోన్లు చేయటంతో.ఫోన్ కాల్ బయటపడటంతో తాజాగా వైసీపీ పార్టీ నేతలు ఫిర్యాదు మేరకు అచ్చెన్నాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు అవటంతో ఈరోజు ఉదయం ఆయనను అరెస్టు చేసి కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
.