ఈ వైకాపా ప్రభుత్వంలో అన్నింటికి బలి అవుతున్నది పోలీసులు...వంగలపూడి అనిత

ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ వైకాపా ప్రభుత్వంలో అన్నింటికి బలి అవుతున్నది పోలీసులు.ఒక ఎస్పి ని బయటకు తెచ్చి మాట్లాడించారు.

 Police Are The Victims Of Everything In This Vaikapa Government , Vangalapudi An-TeluguStop.com

ఫక్కిరప్ప మాట్లాడిన మాటలను డిజిపి సమర్థిస్తారా చెప్పాలి.నిన్న మీడియా సమావేశంలో ఎస్పి ఫక్కిరప్ప ఆ వీడియో లో ఉన్నది మాధవ్ కాదని ఎక్కడ చెప్పలేదే.

బాధిత మహిళ ఎంతో భాద తో బయటకు వచ్చి చెప్పింది.ఒరిజినల్ వీడియో లేదని చెప్తున్నారు కదా ఎంపీ మాధవ్ ఫోన్ లో ఒరిజినల్ వీడియో ఉంది.

అది తీసుకుని పరీక్ష జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి.

మాధవ్ ఎందుకు తన పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు.

ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఫోరెన్సిక్ విభాగం చెప్తోంది.జాతీయ మహిళా కమిషన్ ఈ విషయం పై విచారణ జరపాలి.

ఎంపీ మాధవ్ ను రక్షించాలని సీఎం అన్ని వ్యవస్థలను మారుస్తున్నారు.పించనులను ఇవ్వాలి అంటే వాలంటీర్ల లైగింక వాంఛ తీర్చితే కానీ ఇస్తే పరిస్థితి లేదు.

ఈ విషయం పై గవర్నర్ ని కలిస్తాం, హోమ్ మంత్రి అమిత్ షా ను కలిస్తాం.మాధవను బర్త్ రఫ్ చేసే వరకు మా పోరాటం ఆగదు.

దిశ చట్టం ఉందొ లేదో అందరకి తెలుసు.ఈ సమావేశంలో రాష్ట్ర మహిళ ఈతల పాకజాత, గోడి అరుణ, కేదారి లక్ష్మి,గనగళ్ల సత్య, తల్లా పళ్ళఉమారాణి, మట్టం ప్రమీల రావు, కే అప్పల నరసింహఅమ్మ, దువ్వి లక్ష్మీ లావణ్య,తోట శ్రీదేవి, గొల్లగాని సౌజన్య,తదితరులు పాల్గొన్నారు,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube