ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ రసవతరంగా సాగుతుంది.ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విజేతగా గెలవడానికి ఈ టోర్నీలో 32 టీమ్స్ పోటీ పడుతున్నాయి.
ఈ క్రమంలో ఎలాంటి అంచనాలు లేని సౌదీ టీం కొద్ది రోజుల క్రితం వరల్డ్ బెస్ట్ మూడో ర్యాంకు కలిగిన అర్జెంటీనాపై గెలవటం తెలిసిందే.ఈ క్రమంలో నేడు అదే సౌదీ అరేబియా జట్టు… పోలాండ్ చేతులో చిత్తుచిత్తుగా ఓడిపోయింది.2-0 తేడాతో ఓటమిపాలయ్యింది.
దీంతో గ్రూప్ Cలో పోలాండ్ టాప్ స్థానానికి చేరుకుంది.
పోలాండ్ జట్టులో 39వ నిమిషంలో పియోట్ జిలిన్, 82వ నిమిషంలో కెప్టెన్ రాబర్ట్ లేవెండోస్కి గోల్స్ కొట్టడం జరిగింది.ఈ క్రమంలో సౌదీ ఆటగాళ్లు.చివరి వరకు పోలాండ్ గోల్ పోస్ట్ పై బంతిని తన్నినా గాని.సఫలం కాలేకపోయారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పోలాండ్ టీం సమిష్టిగా చివరి వరకు అద్భుతంగా రాణించింది.