తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “పోకిరి” చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు రికార్డులను కూడా నెలకొల్పింది. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది.
కాగా షియాజీ షిండే, సుబ్బరాజు, నాజర్, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రంలో లేడీ విలన్ పాత్రలో నటించిన “జ్యోతి రానా” ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.
అంతేగాక ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ “గిల్లితే తట్టుకోవాలి అరవ కూడదు” అంటూ జ్యోతి రానాతో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటాయి.
అయితే జ్యోతి రానా బాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగానే రాణిస్తోంది.
అలాగే తెలుగులో పోకిరి చిత్రంలో నటించిన తర్వాత దేవుడు చేసిన మనుషులు, హోమం, తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.కాగా ప్రస్తుతం జ్యోతి రానా ఒక పక్క సినిమాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే మరోపక్క మోడలింగ్ రంగంలో కూడా బాగానే రాణిస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పలు ప్రముఖ ఫోటో సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అందాలతో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.
అయితే బాలీవుడ్లో ఈ అమ్మడు నటించిన “కరర్ ది డీల్” అనే చిత్రం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.
ఇటీవలే కాబెరేట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో జ్యోతి రానా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా ఉంటోంది.