దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సోషల్ మీడియాలో సెలబ్రిటీలని మించిపోయిన అత్యధికంగా ఫాలో అవుతున్న వ్యక్తుల జాబితాలో అతను నెంబర్ వన్ గా ఉన్నారు.
ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ నెటిజన్లు అడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతూ ఉంటారు.అలాగే మోడీ ఏదైనా పోస్ట్ పెడితే వెంటనే లక్షల సఖ్యలో దానిని ఫాలో అవుతారు.
వాటికి రియాక్షన్స్ కూడా వస్తాయి.అయితే మోడీ ఉన్నపళంగా సోషల్ మీడియా విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల నుంచి నిష్క్రమించాలని అనుకుంటున్నట్లు ఒక్క ట్వీట్ తో సంచలనం సృష్టించారు.వచ్చే ఆదివారం నుంచి పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఏ విషయం అనేది త్వరలో మీకు తెలియజేస్తా అని పోస్ట్ పెట్టారు.మోడీ పెట్టిన ఈ పోస్ట్ కి వెంటనే లక్షల్లో రియాక్షన్స్ వచ్చాయి.
చాలా మంది సోషల్ మీడియాకి దూరం కావద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మోడీ సోషల్ మీడియా వీడటంపై స్పందించి విమర్శలు చేశారు.
మనసులో ద్వేషాన్ని వీడండి సోషల్ మీడియాకి కాదు అంటూ ట్వీట్ చేశారు.అలాగే తెలంగాణా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మోడీ ఎకౌంటు హ్యాకింగ్ గురైందా అని పోస్ట్ చేశారు.
అయితే ఈ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ నేడు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.