ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ప్రాణాంతక వైరస్ కరోనా.ప్రపంచంలోని అని దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను నానా ఇబ్బందులు పెడుతుంది.కంటికి కనిపించని అతిసూక్ష్మజీవి అయిన ఈ కరోనా వైరస్.ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.ముఖ్యంగా దేశలన్నీ అన్లాక్ ప్రక్రియస్టార్ట్ చేశాకా.కరోనా వేగం మరింత వేగంగా మరింది.
ఇటు భారత్లోనూ కరోన ఊహించని విధంగా విజృంభిస్తోంది.ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటిపోయింది.అలాగే కరోనా కాటుకు బలవుతున్న వారి సంఖ్య 50 వేలకు చేరువలో నిలిచింది.ఇలాంటి తరుణంలో కరోనా వ్యాక్సిన్పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.
నేటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు కావడంతో.మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది అతిథులు హాజరయ్యారు.ఇక పతాక ఆవిష్కరణ అనంతరం ఎర్రకోటపై నుంచి మోదీ మాట్లాడుతూ.కరోనా వ్యాక్సిన్ అతి త్వరలోనే దేశప్రజలందరికీ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.అలాగే ప్రస్తుతం దేశంలో 3 వ్యాక్సిన్లు ట్రయిల్స్ దశలో ఉన్నాయని మోదీ తెలిపారు.
వాటిని శాస్త్రవేత్తలు ఆమోదించిన వెంటనే.ప్రజలందరికీ భారీస్థాయిలో ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
మరియు ఈ కరోనా పోరులో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు.కాగా, ఎర్రకోటపై ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ఇది ఏడోసారి.