కరోనా పరిస్థితులతో ఏర్పడిన అత్యాయక స్థితి కారణంగా దేశంలో సినిమా థియేటర్లు అన్ని మూత పడ్డాయి.అలాగే సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.
ఆరు నెలల కాలం తరువాత మరల లాక్ డౌన్ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో వ్యవస్థలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి గాడిలో పడుతున్నాయి.సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు.
ఈ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా థియేటర్లు ఓపెన్ చేయడానికి యాజమాన్యాలు సిద్ధం అవుతున్నాయి.ఇక థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే ఆడియన్స్ థియేటర్లుకి ఒకప్పటి మాదిరి వెళ్లి సినిమాలు చూస్తారా అంటే చెప్పలేని పరిస్థితి.
అయితే థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు వేయడం మొదలు పెడితే ఆడియన్స్ మెల్లగా రావడం మొదలు పెడతారని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా రిలీజ్ కాబోయే మొదటి సినిమా ఏంటి అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ గా తెరకెక్కిన పీఎం నరేంద్రమోదీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఆ సినిమా యూనిట్ విడుదల తేదీని ఖరారు చేసి ప్రకటన చేసింది.
మోదీ పాత్రలో వివేక్ ఒబేరాయ్ నటించిన ఈ సినిమా మే 24న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.అయితే, కరోనా వల్ల అది కుదరలేదు.కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి మరల ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను కరోనా నిబంధనలు పాటిస్తూ తెరవడానికి అనుమతులు రావడంతో చివరకు ఈ సినిమాను విడుదల చేయడానికి ఆ సినీ యూనిట్ సిద్ధమైంది.
లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా ఇదేనంటూ ఈ చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.ఈ నెల 15నే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది.