ఏపీ రాజకీయాలపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు.ఏపీకి చెందిన పార్టీ నాయకులు , కార్యకర్తలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తూనే చంద్రబాబు ని లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడారు.

 Pm Narendra Modhi Sensational Coments On Tdp-TeluguStop.com

ఎపిలో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.గతంలో ఎన్.టి.రామారావు కాంగ్రెస్ ను దుష్ట కాంగ్రెస్ అని విమర్శించేవారని, కాని ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కాంగ్రెస్ తో దోస్తి చేస్తున్నానని ఆయన అన్నారు.

తెలంగాణలో మాహాకూటమిని తిరస్కరించినట్టే…ఏపీలో అధికార పార్టీ టీడీపీని ప్రజలు ఓడిస్తారని ఆయన అన్నారు.ఎపి ప్రజలు మార్పుకోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.రాష్ట్ర ప్రభుత్వం అన్నీ అవాస్తవాలే ప్రచారం చేస్తోంది అన్న మోదీ… ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.అలాగే… విభజనపై మిగతా పార్టీలు రాజకీయం చేస్తుంటే ఏపీకి న్యాయం చేయాలంటూ… మాట్లాడింది బిజెపియేనని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube