రేటింగ్ లో రికార్డులు సృష్టించిన మోడీ స్పీచ్

కరోనా కారణంగా దేశం యావత్తు అష్టదిగ్భంధనంలో ఉంది.ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు.

 Pm Modi's Lockdown Address Best In Terms Of Tv Ratings, Corona Effect, Covid-19,-TeluguStop.com

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా కారణంగా రోడ్డుపైకి ధైర్యంగా తిరగలేని పరిస్థితి నెలకొని ఉంది.ఇక ప్రధాని మోడీ ఈ కరోనా ప్రభావం దేశం మొత్తం విస్తరించకుండా ఎప్పటికప్పుడు మీడియా ముందుకి వచ్చి ప్రజలని సందేశం ఇస్తున్నారు.

అలాగే అధికారుల బృందంతో కలిసి అప్రమత్తత తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే కరోనా ప్రభావం కారణంగా దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు.

జనతా కర్ఫ్యూకి పిలుపునిస్తూ చేసిన సందేశాన్ని దేశం యావత్తు వీక్షించారు.ఇక ఈ వీడియో రేటింగ్ లో మంచి రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక తాజాగా మరోసారి దేశమంతటా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రసంగం ఇచ్చారు.ఇక ఈ ప్రసంగం రేటింగ్స్ లో మరోసారి రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ ప్రసంగం టీవీ వీక్షణల పరంగా అత్యధిక రేటింగ్‌ను సాధించిందని ప్రసార వీక్షకుల పరిశోధనా మండలి తెలిపింది.ఇది 2016లో మోదీ ప్రసంగించిన పెద్ద నోట్ల రద్దు కంటే అత్యధికమని తెలిపింది.19.7 కోట్ల మంది ప్రజలు ఆ ప్రసంగాన్ని వీక్షించినట్లు తెలిపింది.ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను 13.3 కోట్ల మంది వీక్షించగా, అంతకంటే ఎక్కువ మంది మోదీ ప్రసంగాన్ని వీక్షించారని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube