మహా కూటమి దేశ సమగ్రతని దెబ్బ తీస్తుంది! ప్రధాని మోడీ కీలక వాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు విశాఖలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ ప్రసంగంలో అడుగడుగున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, జాతీయ స్థాయిలో తనకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న పార్టీల మీద విమర్శల దాడి చేసారు.

 Pm Modi Sensational Comments On Mahakutami Alliance-TeluguStop.com

దేశాన్ని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న తనకి వ్యతిరేకంగా భావసారూప్యం లేని పార్టీలు, అవినీతితో నిండిపోయిన పార్టీలు ఆన్ని ఒకే వేదికపైకి వచ్చాయని విమర్శలు చేసారు.వీళ్ళందరూ ఏకమై భారత్ ఆర్మీ పోరాటాలని అవమానించే విధంగా, ఆ దేశానికి మద్దతుగా మాట్లాడటం భారత ప్రజలని కించపరచడమే అని మోడీ వాఖ్యలు చేసారు.

ఇక ఈ రోజు ఈ విపక్షాలన్నీ ఎ విమర్శలైతే చేస్తున్నాయో వాటినే పాకిస్తాన్ పార్లమెంట్ అవకాశంగా తీసుకొని భారత్ పై నిందలు వేస్తుందని మోడీ విమర్శలు చేసారు.అలాగే బీజేపీ సర్కార్ ఏపీ అభివృద్ధికి, ఉత్తరాంద్ర అభివృద్ధికి కట్టుబడి వుందని మోడీ చెప్పుకొచ్చారు.

ఏపీ అభివృద్ధిలో విశాఖ కేంద్రంగా వుండాలని ఇక్కడ అనేక సంస్థలు నెలకొల్పడం జరిగింది అని మోడీ చెప్పుకొచ్చారు.అలాగే రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మహాకూటమి నేతృత్వంలో బలహీనమైన ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తే దేశాన్ని భ్రష్టుపట్టిస్తారని మోడీ వాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube