నీతి అయోగ్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కావడం జరిగింది.ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పనితీరును ప్రస్తావిస్తూ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ.
పొగడ్తలతో ముంచెత్తారు.దేశంలో వెనుకబడిన జిల్లాల కింద ఎంపికైన ఆశావహ జిల్లాలకి సంబంధించిన అభివృద్ధి విషయంలో సీఎం జగన్ సహకారం అభినందనీయమని కొనియాడారు.
అనుభవ పూర్వకమైన యువ ఉన్నతాధికారులను సుదీర్ఘకాలం నియమించి.జిల్లాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు.
కేంద్రం, రాష్ట్రాలు… స్థానిక పాలన యంత్రాంగం కలసి చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తుందని తెలిపారు.ప్రజల భాగస్వామ్యంతోనే వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లు కూడా పాల్గొన్నారు.వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం, వైజాగ్, కడప జిల్లాలు ఎంపికయ్యాయి.
ఈ క్రమంలో తెలంగాణ నుండి భూపాలపల్లి, అసిఫాబాద్, ఖమ్మం తదితర జిల్లాలు ఉన్నాయి.