దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అంతకంతకూ పెరిగి పోతుండటంతో కరోనా బారిన పడిన రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంటుంది.
పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క ఇండియాలో లాక్ డౌన్ విధించాలి అని అంతర్జాతీయ నిపుణుల నుండి ఒత్తిడి వస్తూ ఉంది.ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా ప్రధాని మోడీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు.
దేశంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తే ఎలా ఉంటుంది.? ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వంటి విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులు కూడా పాల్గొంటున్నారు.
అదేవిధంగా హాస్పిటల్ లో పడకాలు మరియు ఆక్సిజన్ సరఫరా.వ్యాక్సినేషన్ పై కూడా చర్చించ బోతున్నారు.
ఈ సమావేశంలో మంత్రులు మరియు ఉన్నత అధికారుల అభిప్రాయాలను మోడీ తెలుసుకొని దేశంలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
.