ప్రాణ స్నేహితుడిని మిస్ అవుతున్నా అని ట్వీట్ చేసిన మోడీ

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన పేరు దేశ విదేశాలలో ప్రతిరోజు చర్చనీయాంశంగా మారింది.దీనికి కారణం ఆయన అవలంబిస్తున్న తీరే.

 Pm Modi Tweets On Arun Jaitley’s First Death Anniversary, Arun Jaitley, Pm Mod-TeluguStop.com

దేశానికి ప్రయోజనం జరిగే కొన్ని అంశాలలో ప్రతిపక్షాలు, మీడియా, ప్రముఖులు దానిని వద్దని అంటున్న వాటిని పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్ళిపోతున్నారు.అదే ప్రస్తుతం నరేంద్ర మోడీకి అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశ అధ్యక్షుడికి లేనంత గుర్తింపును తెచ్చింది.

నరేంద్ర మోడీ పాలన సమయంలోనే అరబ్ దేశాలు తమ అత్యుత్తమ పురస్కారాలను ఒక ఇండియన్ ప్రధానికి కట్టబెట్టాయి.నరేంద్ర మోడీ అధికారంలో భారత్ ఎన్నో సంచలన విజయాలను సాధించి తన పరపతిని అంతర్జాతీయంగా ఎంతో మెరుగు పరుచుకుంది.

ఈ అంశలే భారతీయులలో నరేంద్ర మోడీని ఒక సూపర్ హీరోని చేశాయి.తాజాగా అలాంటి నరేంద్రమోడీ తన ట్విట్టర్ వేదికగా తన ఆప్త మిత్రుడిని మిస్ అవుతున్నానని ఓ మెసేజ్ చేశారు.

ఇంతకీ ఆ మిత్రుడు ఏవరంటే కేంద్ర మాజీ మంత్రి బీజేపీ అగ్ర నేత అరుణ్ జైట్లీ సరిగ్గా గత సంవత్సరం ఈరోజునే ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు.ఆయన తెలివితేటలు, చతురత చాలా గొప్పవని మోడీ అన్నారు.

అరుణ్ జైట్లీ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యాలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube