టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మనవడు నారా దేవాన్ష్ బర్త్ డేను పురస్కరించుకుని విజయవాడలో ఉగాది పర్వదినాన భారీ విందును ఇవ్వనున్నారు.దాదాపు 1,500 మంది హాజరుకానున్న ఈ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు.ఈ విందుకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పార్టీ నేతలకు ఆహ్వానం పలికారు.
ఇక మీరు కూడా హాజరుకావాల్సిందేనని ఆయన అధికార యంత్రాంగానికి కూడా ఆహ్వానం పలికారు.గత నెల 22న దేవాన్ష్ బర్త్ డేను హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
నాడు తేదీల ప్రకారం దేవాన్ష్ బర్త్ డే వేడుక జరపగా, తాజాగా ఈ నెల 8న ఉగాది పర్వదినాన విజయవాడలో తిథుల ప్రకారం మరోమారు దేవాన్ష్ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
.