ఒకప్పుడంటే ఆడవాళ్ళు వంట ఇంటికే పరిమితం కావడం, అలాగే చదువు, సంద్యలకి దూరంగా ఉండటం వంటి వాటి కారణంగా వంటింట్లో కుందేలు లాగా ఉండే వాళ్ళు.కానీ ప్రస్తుతం కాలం మారడంతో మహిళలకి పురుషులతో సమానంగా రిజర్వేషన్లు కల్పించడం అలాగే ప్రతి మహిళ కి పురుషుడితో పాటు చదువు కూడా అవసరమనే అవగాహణ పెరిగింది.
దీంతో ప్రస్తుతం ఆడపిల్లలని ప్రోత్సహిస్తే ఇంటి బాధ్యత పెట్టడమే కాకుండా అంతరిక్షంలోకి సైతం వెళ్లి వస్తున్నారు.అంతేకాకుండా ద్విచక్ర వాహనంతో మొదలుకొని అంతరిక్ష నౌకలని కూడా చాలా సులభంగా నడుపుతున్నారు.
అయితే తెలుగులో తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ హారిక నారాయణ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఆ మధ్య ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సరిగమప సంగీత కాంపిటీషన్లో పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఈ మధ్య కాలంలో సింగర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా సింగర్ హారిక నారాయణ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫోటోని షేర్ చేసింది.
అయితే ఈ ఫోటోలో హారిక నారాయణ్ యమహా ఆర్15 ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కనిపించింది.అయితే మామూలుగా ఆడపిల్లలు స్కూటీలను నడవడానికి ఇష్టపడతారు కానీ ఎంతోమంది యువకులు ఇష్టపడేటువంటి ఈ యమహా బైక్ ని హారిక నారాయణ్ చాలా ఈజీగా నడపడంతో కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే హారిక నారాయణ్ ఈ ఫోటోకి ఈ ద్విచక్ర వాహనాన్ని నడిపే క్రమంలో నా సోల్ ని మిస్ అయ్యానంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.అలాగే బైక్ యజమాని కి థాంక్స్ కూడా తెలియజేసింది.
దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల సింగర్ హారిక నారాయణ్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య చిత్రంలోని లాహే లాహే పాట పాటతో ప్రేక్షకులను కట్టిపడేసింది.కాగా ఇటీవలే ఈ లిరికల్ పాటని యూట్యూబ్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.