సోషల్ మీడియా కు యువత బాగా అలవాటు పడింది.కేవలం పంచుకునే పోస్టులకు, చెప్పుకునే కబుర్లకే కాకుండా వీడియోల ద్వారా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
చాలా వరకు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రం యూట్యూబ్ లో తమ పేర్ల మీద అకౌంట్లు క్రియేట్ చేసుకొని అందులో ఎన్నో వీడియోలతో పాటు ప్రాంక్ వీడియో లను కూడా పంచుకుంటున్నారు.నిజానికి ప్రాంక్ వీడియోలు చాలా వరకు బాగా వైరల్ గా మారి అందరినీ నవ్విస్తూ ఉంటాయి.
కానీ కొన్ని సందర్భాలలో చిరాకు తెప్పించే విధంగా, కోపంగా కూడా అనిపిస్తుంటాయి.ఎందుకంటే జనాల మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలీదు.కానీ వారిపై ప్రాంక్ వీడియోలు చేయడం వల్ల కొన్ని కొన్ని సార్లు తీవ్రమైన పరిణామాలు కూడా ఎదురవుతుంటాయి.అయినా కూడా సోషల్ మీడియా ప్రియులు మాత్రం ఏదో ఒక ప్రాంక్ వీడియో చేస్తూనే ఉన్నారు.
అలా తాజాగా బుల్లితెర చైల్డ్ నటి సహృద ఒక ప్రాంక్ వీడియో చేయగా తనపై నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.ఇంతకు ఆ సహృద ఎవరంటే.
బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం.రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే మొదటి స్థానంలో ఉంటుంది.ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రేటిలను కూడా బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఇందులో నటించే నటుల గురించి వారి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇందులో ఎక్కువగా వంటలక్క కోసం బాగా చూసేవారు ప్రేక్షకులు.అంతేకాకుండా హిమ, సౌర్య పాత్రలే కాకుండా అందరి పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
ఇక ఇప్పుడు సీరియల్ లో పాత్రలు పెద్దగా అయ్యారన్న విషయం తెలిసిందే.ఇక పిల్లలు సీరియల్ కు దూరంగా ఉన్నా సోషల్ మీడియాకు టచ్ లో ఉన్నారు.ముఖ్యంగా అందులో హిమ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సహృద.సహృద ప్రస్తుతం సీరియల్ కు దూరంగా ఉండగా సోషల్ మీడియాతో అందరికీ దగ్గరలో ఉంది.ఫోటో షూట్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
సీరియల్ విరామ సమయంలో కూడా బాగా రీల్స్ చేసేది.ఇక ఇటీవల యూట్యూబ్ లో కూడా తన పేరు మీద ఓ ఛానల్ క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తను షేర్ చేసుకునే వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.
అంతే కాకుండా విపరీతమైన లైక్స్ తో పాటు కామెంట్లు కూడా వస్తాయి.అప్పుడప్పుడు తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన యూట్యూబ్ ఖాతాలో మరో వీడియో పంచుకుంది.
ఇక ఆ వీడియోలో తను ప్లాస్టిక్ పాముతో ప్రాంక్ చేసింది.ఇక అందరూ చాలా భయపడిపోయారు.కూరగాయలు అమ్ముకునే వృద్ధుడిపై కూడా ప్లాస్టిక్ పాము వేయడంతో అతడు భయపడ్డాడు.
ఇక ఆ వీడియో వైరల్ గా మారటంతో నెటిజనులు బాగా కోపం వ్యక్తం చేస్తున్నారు.మన ఎంటర్టైన్మెంట్ లేదా ఫన్ కోసం ఇలా జనాలని ఇబ్బంది పెట్టొద్దని.
కూరగాయలు అమ్మే వ్యక్తి మీద వేశారు.అలా ఎక్కువ వయసులో ఉన్న ప్రజలపై ప్రాంక్ చేయడం వల్ల వాళ్ళకు అకస్మాత్తుగా ఏమైనా అయితే ఏం చేస్తారు.
మన సరదా పక్క వాళ్ళకి సమస్య కాకూడదు అని కామెంట్ పెట్టారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది.