ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.అమెరికాలోని అలాస్కాలో రెండు తేలికపాటి విమానాలు ఢీ కొన్నాయి.
దీంతో అక్కడిక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఓ విమానంలో పైలెట్ ఒకరు మాత్రమే ఉండగా మరొక విమానంలో ఆరుమంది ప్రయాణిస్తున్నట్టు భద్రతాధికారులు వెల్లడించారు.
కాగా స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8:27 నిమిషాలకి సోల్డోట్నా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు వెల్లగించారు.ఇంకా ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ఘటన స్థలంలోనే మరణించగా మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్టు అధికారులు తెలిపారు.
మృతిచెందిన వారిలో అలస్కా చట్టసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత గ్యారీ నాప్ కూడా ఉన్నారు.
శాసన సభ్యులు గ్యారీ నాప్ స్వయంగా విమానం నడిపారని సమాచారం.
ఇంకా ఈ ప్రమాదంపై జాతీయ రవాణా భద్రతా మండలి విచారణ చేపట్టింది.ప్రస్తుతం ఈ ఘటన హాల్ చల్ చేస్తుంది.
కాగా ఇలాంటి విమాన ప్రమాద ఘటనలు అమెరికాలో ఎక్కువగానే సంభవిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.