ఇటీవల కాలంలో కష్టపడి సంపాదించే వారి కంటే కష్టపడకుండా అడ్డదారిలో సంపాదించాలి అనే వారి సంఖ్య చాలా ఎక్కువ.అడ్డదారిలో సంపాదించడం కోసం ఎన్నో కొత్త మార్గాలను అన్వేషించి పక్కా ప్లాన్ తో చేస్తున్నారు.ఓ బంగారు షాప్ కు కన్నం వేసి ఏకంగా రూ.87 లక్షల విలువైన నగలు దొంగతనం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem District ) సుజాతనగర్ లో ఆదివారం వెలుగులోకి వచ్చింది.అసలు దొంగతనం ఎలా జరిగిందో చూద్దాం.
వివరాల్లోకెళితే.కొత్తగూడెం కు చెందిన అలువాల శంకర్( Aluvala Shankar ) సుజాతనగర్ లో ఉండే రవి కాంప్లెక్స్ లో గత తొమ్మిది సంవత్సరాలుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు.ఈ షాప్ కు పక్కనే ఉన్న ఓ గదిని ఇద్దరు వ్యక్తులు గత నెల 26న అద్దెకు తీసుకున్నారు.ఇక బంగారు షాపు యజమాని ఎప్పటికప్పుడు గమనిస్తూ, గత నెల 31న శంకర్ పనుల కోసం హైదరాబాదుకి వెళ్ళిన విషయం ఈ నిందితులకు తెలిసింది.
దొంగతనం చేయడానికి ఇదే మంచి అవకాశం అంటూ అద్దెకు తీసుకున్న గదిలో నుంచి రంద్రం చేసి బంగారు షాపులోకి ప్రవేశించారు.వెంటనే సీసీ టీవీ కెమెరాల వైర్లు తొలగించారు.
ఒక గ్యాస్ కట్టర్ సహాయంతో లాకర్ ఓపెన్ చేసి అందులో ఉండే 42 కిలోల వెండి, 1242 గ్రాముల బంగారం దోచుకుని పరారయ్యారు.ఈ మొత్తం రూ.87 లక్షల విలువ ఉంటుంది.
శంకర్ ఆదివారం ఉదయం షాప్ తెరిచి చూసి దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. చంచుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని షాపును పరిశీలించారు.క్లూస్ టీం బృందం సహాయంతో మరో సీసీ కెమెరా ఉందని గుర్తించి, ఆ సీసీ కెమెరా ను పరిశీలించగా దొంగతనం జూన్ 1 న రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని బయటపడింది.ఇద్దరు దుండగులు బంగారు షాపును దోచుకునేందుకు పక్కాగా ప్లాన్ వేసి పక్కనే ఉన్న గదిని అద్దెకు తీసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు