ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో రెండోసారి పినరయి విజయన్ గెలిచిన సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కేరళలో సిపిఎం పార్టీ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.
ఈ సందర్భంగా విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈనెల 20వ తారీఖున ఏర్పడు తున్నట్లు సమాచారం.ఆరోజే ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేస్తారని 21 మంది క్యాబినెట్ మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సిపిఎం యాక్టింగ్ రాష్ట్ర కార్యదర్శి విజయరాఘవన్ తెలియజేశారు.
కరోనా ఉద్రిక్తత కేరళలో కూడా ఎక్కువగా ఉండటంతో కేవలం కొద్ది మంది సమక్షంలోనే ఆర్బాటం లేకుండా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.అన్ని వర్గాలకీ సమన్యాయం చేసే రీతిలో కేబినెట్ ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు.
సిపిఎం నుంచి 12 , సిపిఐ నుంచి నలుగురు.కేరళ కాంగ్రెస్ అదేవిధంగా జనతాదళ్ ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు గా ఎల్డీఎఫ్ క్యాబినెట్ ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు.
.