కరోనా వైరస్.దీని వ్యాప్తికి కారణం అశుభ్రత.
ఇంకా ఈ కరోనా మహమ్మారి నుండి కోలుకోవాలి అంటే మంచి ఆహారం తీసుకొని ఇమ్మ్యూనిటీ పెంచుకోవడమే కాకుండా ఎంతో శుభ్రంగా కూడా ఉండాలి.లేదంటే చాలా ప్రమాదం.
అలాంటిది కరోనా రోగులు ఉన్న ఓ ఆస్పత్రిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పందులు విహారం చేస్తున్నాయి.ఇంకా ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కర్ణాటకలోని కలాబురాగి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పందులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరుగుతున్నాయి.అక్కడ డాక్టర్లు కూడా వాటిని చూసి చూడనట్లు వదిలివేశారు.మనుషులు తిరుగుతున్న.
ఆ పందులు ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నాయి.
ఇంకా దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంకా ఈ వీడియోను చుసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా చికిత్స అందించి ఆస్పత్రి ఇలా ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు అక్కడ కరోనా రోగులకు ఏ రేంజ్ లో చికిత్స అందిస్తున్నారు అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా కర్ణాటకలో ప్రస్తుతం 60వేలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా వెయ్యి మందికి పైగా మృత్యువాతపడ్డారు.