టేకాఫ్ అవుతున్న విమానంలోకి పావురం దర్శనమిచ్చింది.ఎక్కడ నుంచి వచ్చిందో,ఎలా వచ్చిందో తెలియదు కానీ విమానంలో మాత్రం కాబూతర్ వచ్చి చేరింది.
దీనితో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.ఈ ఘటన అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు లో చోటుచేసుకుంది.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో టేకాఫ్ కు సిద్దమైన ఒక ప్యాసింజర్ విమానం లో పావురం కనిపించింది.అయితే అది విమానం మొత్తం కూడా ఎగురుతూ చక్కర్లు కొట్టింది.
అయితే విమానంలో పావురాన్ని చూసిన ప్రయాణికులు దానిని ఎంజాయ్ చేయలేకపోయారు.అసలుకే కరోనా వైరస్ భయం తో ఎయిర్ పోర్ట్ లో హై అలెర్ట్ కొనసాగుతున్న ఈ సమయంలో కపోతం ఇలా విమానంలో దర్శనమివ్వడం తో అందరూ భయాందోళనకు గురయ్యారు.
దీనితో కపోతం సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెంటనే ఆ విమానం వద్దకు చేరుకొని ఎంతో చాకచక్యం తో ఆ కపోతాన్ని బయటకు పంపించేశారు.దీనితో ప్రయాణికులు అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అయితే విమానం లో పావురం అటూ ఇటూ ఎగురుతూ హాల్ చల్ చేయగా కొందరు ప్రయాణికులు మాత్రం తమ సెల్ ఫోన్స్ లో వీడియోలు తీసి ఎంజాయ్ చేసారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
అయితే అసలు ఆ పావురం విమానం లోకి ఎలా దూరిందో అన్న విషయం మాత్రం అర్ధంకాలేదు.