కొత్త రాష్ట్రం తెలంగాణ రిపబ్లిక్ డే వేడుకల్లో హస్తిన రాజ్ పథ్లో తన శకటంను ప్రదర్శించింది.తెలంగాణలో ప్రముఖంగా జరుపుకునే బోణాల థీమ్తో ఈ శకటంను తయారు చేయడం జరిగింది.
శకటం ముందు పోతు రాజు ఆ వెనుక బోనాలు ఎత్తుకున్న మహిళలు ఆ తర్వాత గోల్కోండ పోర్ట్తో తెలంగాణ శకటం ఆహుతులను ఆకట్టుకుంది.శకటం పక్కన కళాకారులు ప్రదర్శించిన నృత్యరీతులు మరియు పూనకాలు అన్ని కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి థీమ్తో శకటంను రాజ్పథ్లో నడిపించింది.ఇంకా కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖలు కూడా తమ శకటాలను ప్రదర్శించాయి.
కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా శకటం అందరిని ఆకట్టుకుంది.