రెండు కళ్లు లేని వాళ్లు చాలామంది రోడ్డు పక్కల బిక్షాటన చేసుకొని, లేదంటే ఏదో ఒక స్వయం ఉపాధి పొందుతూ బ్రతుకు సాగిస్తుంటారు.కొంతమంది మాత్రం తమ తెలివితేటలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
అయితే ఓ వికలాంగుడు తనకున్న తెలివితేటలను వేరే మార్గంలో ఉపయోగించాడు.రెండు కాళ్లు పనిచేయకపోయినా కూడా, కూర్చున్నచోట నుంచి ముందుకు కదలలేని స్థితిలో ఉన్న కూడా దొంగతనాలు చేయడంలో మాత్రం ఆరితేరిపోయాడు.
ఇప్పుడు అతన్ని ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన ఉప్పల పూర్ణచందర్రావు పుట్టి వికలాంగుడు.
అతనికి రెండు కాళ్లు పనిచేయవు.అయితే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు పై దృష్టి సారించి చిన్నగా అక్కడకు పాకుతూ వెళ్తాడు.
కొద్దిసేపు ఆ వాహనం వద్ద తిరుగుతూ తన వద్ద ఉన్న తాళాలతో వాహనాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు.అది రాకపోతే ఇగ్నేషన్ తీగులు పీకేసి సమీపంలో ఉన్న వాళ్ళ సాయంత్రం తీసుకుని మోహన్ స్టార్ట్ చేయించుకొని అక్కడ్నుంచి పలాయనం చిత్తగించాడు.
అలా దొంగతనం చేసిన వాహనాలను జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరలు అమ్మేస్తూ ఉంటాడు.అలా ఇప్పటి వరకు 25 వాహనాలని అతను దొంగతనం చేసేసాడు.2013లో కూడా అతను అలాగే నేరాలు చేసి పట్టుబడినట్లు సమాచారం.మొత్తానికి 25 టీవీఎస్ వాహనాలు దొంగతనం చేసి వికలాంగుడైన చోర కళలో తనను మించిన వాడు లేడు అని మాత్రం నిరూపించుకున్నారు.