మామూలుగా ఎక్కడైనా సరే వధువు లేదా వరుడు కి పెళ్లి చేయాలంటే జోడిగా సరైన జీవిత భాగస్వాములను ఎన్నుకోవడం మనం తరచూ చూస్తుంటాం.ఒకవేళ వధువు లేదా వరుడు జాతకంలో దోషం ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పండితుల దగ్గరికి లేదా గుడికి వెళ్లి దోష నివారణ పూజలు చేస్తుంటారు.
కానీ అక్కడ మాత్రం వధువుకి దోషం లేదా అంగ వైకల్యం ఉన్నట్లయితే జంతువులతో పెళ్లి చేసి ఆ తర్వాత వరుడితో పెళ్లి చేసే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. అది ఎక్కడో కాదు మన దేశంలోనే.
టెక్నాలజీ పరంగా భారతదేశం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు ఇప్పటికీ మూఢ నమ్మకాలను పాటిస్తూ, వింత ఆచారాల పేరుతో వింతగా ప్రవర్తిస్తుంటారు.దేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో ఆచారాలను మూఢ నమ్మకాలను పాటిస్తారు.
అయితే ఇందులో భాగంగా వీళ్ళు దేవుడితో పాటూ ఎక్కువగా దెయ్యాలు కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా నమ్ముతారు.అంతేగాక కొన్ని గిరిజన తెగలకి చెందిన ప్రజలకి బాలుడు లేదా బాలిక అంగ వైకల్యంతో జన్మించినట్లయితే ఆమెకు దయ్యం పట్టిందని చాలా వింతగా చూస్తారట.
అంతేగాక ఆ బాలికకు పెళ్లిడు వచ్చిన తర్వాత పెళ్లి చేసే సమయంలో మొదటగా గ్రామంలోని ఓ కుక్క కి ఇచ్చి పెళ్లి చేసిన రెండు రోజుల తర్వాత మళ్లీ యధావిధిగా వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు.కానీ మొదటి రాత్రి మాత్రం వధువు ఒంటరిగా గడుపుతుందట.
ఇలా చేయడం వల్ల వధువుకి పట్టిన దయ్యం లేదా దోషం వదులుతుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారట.అయితే ఇలా చేయడం ఒక్క బాలికల విషయంలోనే కాకుండా మగవారి విషయంలో కూడా జరుగుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.ఈ విషయంపై స్పందించినటువంటి కొందరు నెటిజన్లు “మామూలుగా జన్యుపరమైన లోపాల కారణంగా శిశువులు అంగవైకల్యంతో జన్మిస్తారని ఆ విషయం తెలుసుకోకుండా కొందరు ఇలా దయ్యం పట్టిందని దోషం ఉందని”….
మూఢనమ్మకాల పేరుతో జంతుహింసకి పాల్పడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.అంతేగాక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ విషయం పై ప్రజలకు అవగాహన కల్పించాలని మరి కొందరు కోరుతున్నారు.