ప్రపంచ దేశాలన్నీ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయి.ఆయన ఏం చేసినా కూడా అది ఓ సంచలనం అవుతుంది.
ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా క్లిష్టంగా ఉంటాయి.కిమ్ కు సంబంధించిన వార్తలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి.
ఇప్పటికే కిమ్ హెల్త్ విషయంపై అనేక వార్తలు వస్తున్నాయి.తాజాగా కిమ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
దీంతో కిమ్ మరోసారి వార్తలో నిలిచారు.ఆ ఫొటోల్లో కిమ్ తలపైన ఆకుపచ్చని రంగులో ఓ గుర్తు, బ్యాండేజ్ వంటివి ఉన్నాయి.
జూలై 24వ తేది నుంచి 27వ తేది వరకు ఆయన కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు.ఆ టైంలో కిమ్ తలపై కుడి భాగంలో ఓ మచ్చ కనిపించింది.
అంతేకాదు తలకు వెనకవైపుగా ఓ బ్యాండేజ్ కూడా ఉంది.జూలై 27వ తేది నుంచి 29వ తేది మధ్య జరిగిన కార్యక్రమాల్లో కిమ్ జోంగ్ ఉన్ తలపై మచ్చ, బ్యాండేజ్ కనిపించాయి.37 ఏళ్ల కిమ్ అనారోగ్యంతో ఉన్నాడని చాలా రోజుల నుంచి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అనారోగ్యం వల్ల గత సంవత్సరం కొన్ని నెలలపాటు కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, ఆయన అనారోగ్యంతో ఉన్నారనే వార్తలకు ఈ ఫోటోలు మరింత బలాన్ని చేకూర్చాయి.
అలాగే తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్ జయంతి వేడుకలకు ఏప్రిల్ 15న గతేడాది కిమ్ హాజరు కాకపోవడంతో అందరికీ సందేహం కలిగింది.
ఆయన అనారోగ్యం పైన అనేక వార్తలు రావడమే కాదు.ఒకానొక టైంలో కిమ్ మృతి చెందినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి.కిమ్ బరువు తగ్గడం చూస్తే ఆయన కావాలనే బరువు తగ్గారా అని అందరూ చర్చించుకుంటున్నారు.
తాజాగా ఆయన తలపై బ్యాండేజ్ తో కనిపించడం ఫోటో ఇంకోసారి ఆయన ఆరోగ్యం గురించి చర్చించుకునేలా చేసింది.చూడాలి మరి కిమ్ ముందుముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో వేచి చూడాలి మరి.