టాలీవుడ్లో తెలుగమ్మాయిలు తక్కువ అయ్యారు.ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు వారు మాత్రమే హీరోయిన్స్గా ఉండే వారు.
ఆ తర్వాత తర్వాత ఇతర భాషలకు చెందిన వారు దిగుమతి అవుతూ వచ్చారు.గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితా తీస్తే ఖచ్చితంగా అందులో 90 శాతం మంది తెలుగేతరులే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇషారెబ్బా తెలుగు అమ్మాయి అయినా హీరోయిన్గా రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా ఈ అమ్మడు రాగల 24 గంటల్లో చిత్రంలో నటించింది.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఆమె ఉంది.ఆ సినిమా తర్వాత ఈషాకు టాలీవుడ్లో మరిన్ని మంచి ఆఫర్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు ఇప్పుడు చేసింది ఒకెత్తు అన్నట్లుగా ఈ అమ్మడు ప్రచారం చేస్తోంది.ఇక అందాల ప్రదర్శణలో ఏమాత్రం తగ్గని ఈ అమ్మడు తాజాగా తన సోషల్ మీడియా పేజ్లో ఈ ఫొటోను షేర్ చేసింది.
తెలుగమ్మాయే అయినా ముంబయి ముద్దుగుమ్మ స్టైల్లో రచ్చ ఫోజ్ ఇచ్చింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.