తెలుగమ్మాయి ఈషా రెబ్బ ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవ్వడం లేదు.
ఆమద్య వచ్చిన రాగల 24 గంటల్లో సినిమా ఈమెకు నటిగా గుర్తింపు తెచ్చి పెట్టింది.కాని ఈమెకు కమర్షియల్గా అయితే సక్సెస్ ఇంకా రావడం లేదు.
ప్రస్తుతం ఈమె మరో రెండు సినిమాల్లో చేస్తుంది.చిన్న సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోలకు జోడీగా నటించాలని ఆశ పడుతోంది.
అందుకోసమే ఈ అమ్మడు హాట్ ఫొటో షూట్స్తో రెచ్చి పోతుంది.సమయం వచ్చినప్పుడలా లేదంటే వారంలో కనీసం రెండు మూడు సార్లు తన ఫొటో షూట్ స్టిల్స్ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఈ అమ్మడి పోస్ట్కు అంతా ఫిదా అవుతూ ఉంటారు.తాజాగా ఈ ఫొటోలను పోస్ట్ చేసిన ఈషా రెబ్బ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఇంత అందమైన ముద్దుగుమ్మను వదిలేసి మన స్టార్ హీరోలు ముంబయి వైపుకు ఎందుకు వెళ్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.