సినిమా పరిశ్రమకి మొదటగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా ఎదిగిన హీరో హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే ఇందులో టాలీవుడ్ బ్యూటిఫుల్ క్వీన్ ఛార్మి కౌర్ ఒకరు.
ముందుగా ఛార్మి కౌర్ సినిమా పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్ గా రోజుకు 250 రూపాయల కూలీకి పని చేసింది. ఆ తరువాత తెలిసిన వారి ద్వారా సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలను దక్కించుకుంది.
ఇందులో మొదటగా తెలుగులో ప్రముఖ దర్శకుడు “భీమనేని శ్రీనివాసరావు” దర్శకత్వం వహించిన “నీ తోడు కావాలి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
అయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, అక్కినేని సుమంత్, స్టార్ హీరోల చిత్రాలు హీరోయిన్ గా నటించింది.
అయితే ప్రస్తుతం ఛార్మి కౌర్ సినిమాలలో హీరోయిన్ గా నటించడం లేదు. కానీ పలు టాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బాగానే రాణిస్తోంది.
అయితే తాజాగా ఛార్మి అద్దంలో తీసుకున్నటువంటి ఓ సెల్ఫీ ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో ఛార్మి కౌర్ కొంతమేర సన్నబడినట్లు నాజూకుగా కనిపిస్తోంది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ మీరు మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక ఈ ఫోటోని షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
అయితే ఆ మధ్య ఛార్మి కౌర్ టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఇస్మార్ట్ శంకర్” అనే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.