అల్లు అరవింద్కు ముగ్గురు కొడుకులు.బాబీ, అర్జున్, శిరీష్లు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.
వీరు ముగ్గురు కూడా తాజాగా సంక్రాంతి సందర్బంగా అమ్మ నిర్మలతో కలిసి ఇలా ఫొటో తీసుకున్నారు.ఈ ఫొటోను అమ్మ అబ్బాయిలు అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ కాస్త వైరల్ అయ్యింది.కేవలం 12 గంటల్లోనే భారీ ఎత్తున నెటిజన్స్ షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అల్లు నిర్మల మీడియాలో ఎక్కువగా కనిపించరు.కనుక ఆమె ఫొటో కనిపించగానే నెటిజన్స్ తెగ లైక్స్ కొడుతున్నారు.ముగ్గురు గొప్ప కొడుకులను కన్నారు అమ్మ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.అల్లు శిరీష్ త్వరలో హీరోగా కొత్త సినిమాను మొదలు పెట్టబోతుండగా బాబీ నిర్మాతగా వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక అల్లు అర్జున్ సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు.త్వరలో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఆ సినిమా కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.