ఒక్కోసారి మన జీవితంలో జరిగిన సంఘటనలు కారణంగా పూర్తిగా జీవితం మలుపు తిరుగుతుంది.అంతేకాక ఇతరులు కూడా మనం ఎలా ఎలా జీవించాలానే విషయాలను అప్పుడప్పుడు నిర్ణయిస్తుంటారు.
అయితే ఆ మహిళ జీవితంలో చోటు చేసుకున్న ఓ దారుణమైన సంఘటన ఆమె జీవితం మొత్తాన్ని మలుపు తిప్పింది.అయితే ఆ మహిళ ఎవరో కాదు పూలన్ దేవి.
మామూలుగా పూలందేవి అంటే నక్సలైట్ అని ఆమె పలు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిందని అందరికీ తెలుసు. అసలు ఎందుకు ఆమె నక్సలైట్ గా మారాల్సి వచ్చింది.? అలాగే ఆమె జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం….అయితే పూలన్ దేవి ఉత్తర ప్రదేశ్ లోని పాత్రాకాల అనే గ్రామంలో జన్మించింది.
అయితే అప్పటి వరకు అంత సరిగ్గా సాగిపోతున్న సమయంలో ఆమెకు 16 సంవత్సరాలు నిండడంతో గ్రామంలోని కొందరు పెద్దలు ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు.దీంతో అండగా నిలబడాల్సిన తన తల్లిదండ్రులు ఆమెను చాలా దయనీయ పరిస్థితులలో వదిలేశారు.
దీంతో సమాజం పట్ల మనసు ముక్కలైన పూలన్ దేవి నక్సలైట్లో చేరింది.అయితే అప్పుడప్పుడు ప్రజలను దోచుకున్న సామంతులను దోచుకుంటూ ప్రజలకు ఆ సొమ్మును ఖర్చు పెట్టేది.
దీంతో పూలన్ దేవి కి ఒక రకంగా ప్రజలలో మంచి ఉద్దేశమే ఉన్నప్పటికీ ఆమె చేసేటువంటి పనులు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చి పెట్టాయి.
దీంతో పలుమార్లు ఆమెను లొంగిపోవాలని చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి.
అంతేగాక ఆమధ్య పూలన్ దేవి ప్రముఖ రాజకీయ పార్టీ అయిన సమాజ్వాది పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికి అది కూడా సాధ్య పడలేదు.కాగా 2001 జూలై 26 వ తారీఖున జరిపిన కాల్పుల్లో మృతి చెందింది.