ఓ అపరిచితుడి ఫోన్ కాల్ ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన కొమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
జైనూర్ మండలం కొండిబగూడకు చెందిన రమాకాంత్కు సీతాల్(24) అనే యువతితో వివాహం జరిగింది.వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో ఓ ఫోన్ కాల్ వారి జీవితంలో కలకలం సృష్టించింది.
అదే గ్రామానికి చెందిన అనికేతన్ అనే యువకుడు సీతాల్కు తరచూ ఫోన్ చేసి విసిగిస్తూ ఉండేవాడు.ఫోన్లో చాలా అసభ్యకరంగా మాట్లాడేవాడు.దీంతో సహనం కోల్పోయిన ఆమె అతడిని ఫోన్లోనే చెడుగుడు ఆడుకుంది.దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు సీతాల్ భర్తతో స్నేహం ఏర్పర్చుకుని ఆమెపై లేనిపోని నిందలు మోపాడు.
ఇవి నమ్మిన ఆ భర్త కూడా సీతాల్ను అనుమానించడం మొదలుపెట్టాడు.
ఇది సహించలేకపోయిన సీతాల్, తీవ్ర మనస్థాపానికి గురైంది.
దీంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.వెంటనే ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.