ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో పలు అంతర్జాతీయ ఔషద తయారీ సంస్థలు కరోనా టీపై ప్రయోగాలు చేస్తున్నాయి.
ఇప్పటికే కొందరు టీకా అభివృద్దిలో అడుగులు వేశామని అంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్పై కొత్త ఆశలు చిగురిస్తున్న సమయంలో బిట్రన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశాడు.
ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న పలు సంస్థలు కూడా పురోగతిని సాధిస్తున్న దాఖలాలు కనిపించడం లేవన్నాడు.
వ్యాక్సిన్ వచ్చేందుకు ఏడాదికి పైగా పట్టవచ్చు లేదా అసలు రాకపోవచ్చు.
ఈ సమయంలో జనాలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాతో సహజీవనం సాగించడం తప్ప మరేం చేయలేము అంటూ ఆయన భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు.ఈ సమయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఔషద సంస్థలు మాత్రం వ్యాక్సిన్ తయారికి సంబంధించి పురోగతిని సాధించినట్లుగా చెబుతున్నారు.ట్రైల్స్ కూడా ప్రారంభం అయ్యాయి అంటున్నారు.మరి ఈ విషయంలో ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితి.