'తలైవి' ప్రమోషన్స్ ఆపాలని కోర్టులో పిటిషన్..!

జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న సినిమా తలైవి.ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలయ్యి తమిళనాడులో తీవ్ర చర్చకు దారి తీసింది.ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది. రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.కంగనా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ తలైవి ను విడుదల చేసారు.ఈ ట్రైలర్ చుసిన ప్రేక్షకులకు ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి.

 Petition Filed To Stop Thalaivi Promotions, Petition Filed To Stop Thalaivi Prom-TeluguStop.com

ఈ ట్రైలర్ ఈ సినిమాలో కంగనా ను చుస్తే జయలలితను చూసి నట్టుగానే ఉందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.కంగనా అంతలా ఈ పాత్ర లో జీవించింది.

నిజంగా జయలలిత వచ్చిందా అన్నట్టుగా ఈ సినిమాలో కంగనా కనిపించింది.అభిమానులే కాదు ప్రముఖులు కూడా ఈ ట్రైలర్ చూసి కంగనాకు పొగడ్తలతో ముంచెత్తారు.

మరి కొంత మంది అయితే 2021 జాతీయ ఉత్తమ నటిగా కూడా కంగనా నే అవార్డు అందుకుంటుందని చెబుతున్నారు.

ఈ సినిమాను ఏ.

ఎల్ విజయ్ డైరెక్ట్ చేసారు.తలైవి సినిమా ఏప్రిల్ 23 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టింది.అయితే ఈ ప్రమోషన్స్ ఆపాలని ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు.

తమిళనాడులో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.

అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ ఆపాలని ప్రముఖ న్యాయవాది భారత ఎన్నికల కమిషన్ కి పిటిషన్ లో కోరారు.

ఎన్నికల ముందు ఎలాంటి ప్రచారాలను చేయకూడదు.అలా ప్రచారం చేయడం ఎన్నికల విరుద్ధం.

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయడానికి అనుమతించకూడదని కోర్టును కోరారు.ఈ సినిమాలో కంగనాతో పాటు, అరవింద స్వామి, మధుబాల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube