క్రికెట్కు మన దేశంలో ఓ రకమైన మోజు ఉంది.ఇది చాలా పెద్ద మాటే అయినా కూడా ఇదే నిజం.
ఎందుకంటే క్రికెట్ను మాత్రమే మన దేశంలో చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు.ఎన్ని ఆటలు ఉన్నా కూడా దీని నీడలో అవన్నీ కనిపించకుండా పోయాయి.
అయితే మన దేశం తరఫున ఎవరు ఆడినాసరే దాన్ని కేవలం ఆటగానే చూడకుండా దాన్ని ఎమోషన్స్తో ముడిపెడుతుంటారు.ఇందులో భాగంగా కొన్ని సార్లు ఆటగాళ్లపై విమర్శలు, దాడులు కూడా జరిగిన ఘటనలు మనం చూస్తున్నాం.
వారి ఇండ్ల మీద కూడా దాడులు జరిగాయి.
అయితే ఇప్పుడు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఎంత రసవత్తరంగా జరుగుతున్నాయో చూస్తున్నాం.
కానీ మన ఇండియా టీమ్ కు ఏమైందో ఏమోగానీ అంచానలన్నీ తలకిందులు చేసేస్తోంది.ఇప్పటికే దాయాది పాకిస్తాన్ మీద ఓడిపోవడంతో టీమ్ ఇండియా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే కోహ్లీ టీమ్ మీద కోపంగా ఉన్నారు.ఇక రెండో మ్యాచులో కూడా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
దీంతో కోహ్లీ సేన మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు ఓ లెజెండ్ క్రికెటర్ అండగా నిలిచాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అయిన కెవిన్ పీటర్సన్ అంటే పరిచయం అక్కర్లేదు.అయితే ఆయన ఇప్పుడు కోహ్లీకి, టీమ్ ఇండియాకు మద్దతుగా మాట్లాడాడు.ఇండియా జట్టుకు అభిమానులు మద్దతు ఇవ్వాలని, ఇలా విమర్శించడం మంచిది కాదంటూ సూచించారు.ఆటలో గెలుపు, ఓటములు సహజం అని ఎవ్వరూ కూడా ఓడిపోయేందుకు ఆడరని కామెంట్ చేశాడు.
గెలుపులోనే కాకుండా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మద్దతు అవసరమని చెప్పాడు.దీంతో ఇప్పుడు ఆయన ట్వీట్ మీద చాలా రకాల వార్తలు వస్తున్నాయి.ఎంతైనా ఆయన మద్దతు టీమ్ ఇండియాకు పెద్ద బలం అనే చెప్పాలి.