తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన వనితా విజయ్ కుమార్ ఇటీవలే మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఆమె మూడవ పెళ్లి మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
హీరోయిన్ మూడవ పెళ్లి కనుక సహజంగానే హడావుడి ఉంటుంది.అయితే ఆ హడావుడి కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నారు.
కానీ వనిత అదృష్టం బాగలేదో లేదంటే మరేంటో కానీ మూడవ పెళ్లి కూడా వివాదాస్పదం అవుతోంది.
వనిత గత కొన్నాళ్లుగా తెలిసిన పీటర్ పాల్ ను మూడవ వివాహం చేసుకుంది.
పీటర్ పాల్ పెళ్లి విషయంలో వివాదం అయ్యింది.పెళ్లి అయిన కొన్ని గంటలకే పీటర్ పాల్ మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
నేను చట్టప్రకారం అతడిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా ప్రకటించింది.దీంతో వనిత అతడికి విడాకులు అయిన విషయం తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.దాంతో ఆమెకు మూడవ వివాహం కూడా సంతోషం లేకుండా చేసింది.ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.