సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్.మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా వస్తుందని తెలిసిందే.
ఆమధ్య ఎనౌన్స్ మెంట్ తో పాటుగా లేటెస్ట్ గా చెన్నై వెళ్లి శంకర్ ను కలిసి ప్రాజెక్ట్ డీటైల్స్ తెలుసుకుని వచ్చారు చరణ్, దిల్ రాజు.ఈ క్రమంలో వారంతా కలిసి దిగిన ఫోటో ఒకటి షేర్ చేశారు.
ఇందులో శంకర్, చరణ్, దిల్ రాజులతో పాటుగా మరో వ్యక్తి కనబడుతున్నాడు.అతనెవరు అని సెర్చ్ చేస్తే డైరక్టర్ ఎన్.నరసింహా రావు అని తెలిసింది.తెలుగులో శరభ అనే సినిమా కూడా అతను చేశాడు.
చరణ్, శంకర్ కాంబో అతని వల్లే అవుతుందట.ఎన్నో ఏళ్లుగా శంకర్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నాడు ఎన్.నరసింహా రావు.శంకర్ తో ఉన్న ఆ క్లోజ్ నెస్ వల్లే అతను చెప్పగానే తెలుగులో సినిమా ఫిక్స్ అయ్యాడట.
దిల్ రాజు ఎలాగు శంకర్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.ఇక లైన్ లోకి చరణ్ ను తెచ్చి ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారు.
అలా డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా ఈ మెగా ప్రాజెక్ట్ కు అతనే మూల కారణం అయ్యాడట.త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.శంకర్ సినిమా అంటే భారీతనంతో ఉంటుంది.శంకర్ తన కెరియర్ లో మొదటిసారి తెలుగు హీరోతో సినిమా చేస్తున్నారు.