జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో మాట్లాడుతూ అవినీతి లేని ఆంద్రప్రదేశ్ ని మనం నిర్మించుకోవాలి అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూనే ఉంటారు.గాంధీ కలగనే అవినీతి లేని స్వచ్చమైన భారతావని కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందని, అవినీతిని నిర్మూలిచడానికే నేను పార్టీని పెట్టాను అంటూ చెప్పే పవన్ కళ్యాణ్ మాటలకి ప్రస్తుత చేష్టలకి అస్సలు పోలికే లేదు.
గతంలో ఎవరిపై అయితే పవన్ అవినీతి ఆరోపణలు చేశాడో ఇప్పుడు అదే వ్యక్తిని పవన్ కళ్యాణ్ సలహాదారుగా నియమించుకోవడంతో ఒక్క సారిగా జనసేన పార్టీ అధినేత పవన్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అనాలోచితంగా ఉన్నాయని అనడానికి తాజాగా జరిగిన సంఘటనే కారణం అంటున్నారు.అయన చెప్తున్న మాటలకి చేస్తున్న పనులకి ఎటువంటి పొంతన లేకుండా పోతోందని అంటున్నారు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెన్నై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తెలుగు వ్యక్తి అయిన రామ్మోహన్ రావు పై ఇప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
గతంలో పవన్ సైతం చాలా సందర్భాలలో రామ్మోహన్ రావుతో పాటు ఆయన సన్నిహితుడు అప్పటి టీటీడీ బోర్డు మెంబెర్ శేఖర్ రెడ్డి పైనా ఆరోపణలు తీవ్రస్థాయిలో గుప్పించారు.శేఖర్ రెడ్డి అనే వ్యక్తి లోకేష్ కి ఎంతో సన్నిహితుడని ఆయన ఎంతో అవినీతి పరుడని, రామోహన్ రావు శేఖర్ రెడ్డి కి సన్నిహితుడని ఆయనకు కూడా లోకేష్ తో సన్నిహిత సంబందాలు ఉన్నాయని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
అయితే ఇదంతా గతంలో జరిగిన విషయాలు.కాని ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే.పవన్ కళ్యాణ్ ఎవరిపై అయితే ఆరోపణలు చేశారో ఆవ్యక్తినే పార్టీలో చేర్చుకుని సలహాదారుడిగా అందలం ఎక్కించారు.
గతంలో పవన్ కళ్యాణ్ తానూ అవినీతి పరుడని నిందించిన వ్యక్తినే మర్చిపోయారా.?? లేక అప్పట్లో తానూ పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశారా అనే విషయాలలో ప్రజలకి ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.గతంలో తామే అవినీతి పరుడనే ముద్రని వేసి మళ్ళీ వారినే పార్టీలోకి తీసుకోవడం జనసేన పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది.దాంతో ఇప్పుడు ప్రశ్నలు సంధించే వారికి ఎటువంటి సమాధనం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పార్టీలోని ముఖ్య నేతలు.