మన దేశం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నదని నేతలు చెప్తుంటారు.ఈ క్రమంలోనే సాంకేతికత బాగా పెరిగిపోతున్న మాట వాస్తవమే.
కానీ, దేశంలో అంతటా ఉన్న సమస్య రోడ్ల మీద గుంతలని చెప్పొచ్చు.ఇలా రోడ్లపై ఉన్న గుంతల వల్ల పాదచారులు , అటుగా వెళ్లే వారు, స్థానికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు.
ఈ గుంతల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉంటారు.ఈ క్రమంలోనే టెక్నాలజీ ఉపయోగించి ఈ గుంతలు పూడ్చాలని చాలా మంది అధికారులను వేడుకుంటున్నారు.
కానీ, అధికారుల చర్యలు మాత్రం దాదాపుగా శూన్యంగానే కనబడుతున్నాయి.ఈ క్రమంలోనే అధికారుల తీరుతో విసిగిపోయిన ఆ ప్రాంత ప్రజలు గుంతల వద్ద పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.
ఎక్కడంటే.
కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులోని భారతి నగర్ సొసైటీవాసులు రోడ్డు మీద గుంతలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
ఇకపోతే ఈ పూజను శాస్త్రీయంగా శాస్త్రాల ప్రకారం చేయడం గమనార్హం.ఇద్దరు పూజారులతో గుంతను చక్కగా అలంకరించి మరీ పూజ చేశారు.
స్థానికులు ఆ గుంత చుట్టూ నిల్చుని ప్రదక్షిణలు కూడా చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియో చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.అధికారుల పని తీరుకు ఈ పూజలే నిదర్శనమని, రోడ్ల దుస్థితి మరీ ఇంత ఘోరమా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
కర్నాటకలో రోడ్ ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని, అయినా రోడ్లు ఇలాగుండటమేంటని ఓ నెటిజన్ ప్రశ్నిస్తున్నాడు.బెంగళూరు నగరంలోని కొన్ని చోట్ల రోడ్లు మారుమూల గ్రామీణ ప్రాంతాల కంటే చాలా దారుణంగా ఉన్నాయని అంటున్నారు.రోడ్లు బాగు చేయడంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు.