మద్యం అనేది ఎంతటి మనిషిని అయినా సరే తన ఆధీనంలోకి తీసేసుకుంటుంది.ఎంతటి నిఖార్సైన వ్యక్తులు అయినా సరే మద్యం తాగితే అంతే సంగతులు.
వారు ఏం చేస్తారో వారికి కూడా తెలియదు.మత్తు తేరిపోయిన తర్వాత అడిగితే ఏంటి నేను అలా చేశానా అంటూ షాక్ అవుతారు.
అదే మత్తుకు ఉన్న పవర్.దాని ముందు ఎవ్వరైనా ఒక్కటే.
నిషా ఎక్కిందంటే ముందు ఏముందో కూడా చూసుకోకుండా తినేస్తుంటారు.చాలాసార్లు మద్యం మత్తులో చేసే పనులు అనర్థాలకు దారి తీస్తుంటాయి.
ఇలాంటి ఘటన గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
మనం గతంలో ఒక విచిత్రమైన వార్త గురించి విన్నాం.
బీహార్లో కొందరు మద్యం మత్తులో కాల్చేసిన పామును తిని చనిపోయిన ఘటన ఎంతలా కలలకం రేపిందో తెలిసిందే.ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి తీవ్ర కలకలం రేపుతోంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ ప్రాంతంలో నివసించే అంతర్ సింగ్, జోగిందర్ అలాగే శివరామ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు.అయితే వారంతా కలిసి రీసెంట్ గా పార్టీ చేసుకున్నారు.
మద్యం సగం తాగిన తర్వాత వారికి అక్కడ ఓ పాము కనిపించింది.దాన్ని తినాలని అనుకున్నారు.
ఇక దాన్ని ఏ మాత్రం భయం లేకుండా పట్టుకుని సమాంతరంగా ముగ్గురికి సరిపడే విధంగా దాన్ని కోశారు.ఇక దాన్ని కాల్చుకుని మొత్తం తినేశారు.అసలు అది విషపూరిత పాము కావడంతో దాన్ని తిన్న వారంతా అనారోగ్యానికి గురయ్యారు.ఇందులో ఒకరి పరిస్థితి తీవ్రంగా విషమించింది.
ఇక అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా 12 గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు.ఇక డాక్టర్లు అడగ్గా మద్యం మత్తులో పామును తిన్నట్టు చెప్పారు.
ఇక ఈ వార్త కాస్తా స్థానికంగా అందరినీ షాక్కు గురి చేసింది.ఈ వార్త నెట్టింట ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తోంది.