ప్రస్తుతం ఉన్న అనుభవం గల రాజకీయనాయకులలో కేసీఆర్ ఒకరు.అపర చాణక్యుడిగా, ఎంత తలపండిన రాజకీయ నాయకులకైనా అర్థం కాని వ్యూహాలను ప్రయోగించడంలో కేసీఆర్ దిట్ట అనే విషయం చాలా సార్లు రుజువైంది.
అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కేసీఆర్ సాధించిన విజయాలుగా మనం చెప్పవచ్చు.అయితే ఎంత గొప్ప అపర చానక్యుడైనా కొన్ని సార్లు వ్యతిరేక పవనాలు వీచడం సహజమే.
అయితే అప్పుడు ఆ వ్యక్తి పని అయిపోయిందని అనుకుంటారు.కాని మరల తనకు అనుకూల పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరు.
అయితే అప్పట్లో కూడా కొన్ని రకరకాల సంఘటనలు జరిగినా కూడా అవి ప్రజలోకి వెళ్లడంతో కొంత ఇబ్బంది జరిగిన విషయం వాస్తవమే.అయితే ఇక టీఆర్ఎస్ పనై పోయిందని బీజేపీ, కాంగ్రెస్ లు భావించాయి.
కాని వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే.అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ చెల్లింపుపై హామీ ఇచ్చిన కేసీఆర్, ఆ హామీని నెరవేర్చాడు.
దీంతో ఒక్కసారిగా తెలంగాణలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.ఇక కేసీఆర్ కు పాలాభిషేకాలు చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఒక్కసారిగా బీజేపీ ఇంకా ఇతర పార్టీలు చేసిన ప్రచారం పోయి ఒక్కసారిగా చల్లబడింది.ఇక ఇన్ని రోజులు ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ ఇక మరల ఎటువంటి పంథా ఎంచుకుంటుందో చూడాలి.