సిటీలో బస్సులు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.ఎందుకంటే సిటీలో ఉండే ప్రతి ఒక్కసారికి సిటీ బస్సులు ఎలా దర్శన మిస్తాయో బాగా తెలుసు.
ఉదయం ఆఫీస్ వేళలు, మళ్ళీ సాయంత్రం ఆఫీస్ వదిలేసినప్పుడు కూడా ఒక్క బస్సు కూడా ఖాళీగా కనిపించదు.బస్సులో నిలబడడానికి కూడా ఒక్కోసారి ప్లేస్ ఉండదు.
ఫుట్ పాత్ మీద నిలబడి కూడా ప్రయాణం చేయవలసి వస్తుంది.
బస్సు ఎక్కే వారికి ఈ విషయాలు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు.
ఎందుకంటే బస్సులు ఎంత రద్దీగా ఉంటాయో ఎక్కే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో బస్సు మీద చాలా మంది ఎక్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు.ఆ తర్వాత అనుకోని సంఘటన జరగడంతో ఆ బస్సు మేడ్ ఎక్కినా వారంతా క్షణాల్లో రోడ్డు మీద ఉన్నారు.
ఒక రద్దీగా ఉన్న బస్సులో లోపల ప్లేస్ లేక కొంతమంది బస్సు మీద కు వెళ్లి ఎక్కారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది బస్సు మీద కు ఎక్కారు.
ఎక్కినా వారంతా కామ్ గా కూర్చోకుండా అందరు తమను చూస్తూ ఉన్నారని ఇంకా రెచ్చిపోయి అరుస్తూ ఈలలు వేస్తూ అల్లరి చేస్తున్నారు.అయితే ఇదంతా చూస్తున్న ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తి బస్సును క్రాస్ చేసి ముందుకు వచ్చాడు.
వాళ్ళు ఎందుకు అల్లరి చేస్తున్నారా అని ఆలోచిస్తున్న ఆ బైక్ అతను సడన్ బ్రేక్ వేసాడు.దీంతో బస్సు డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేసి బస్సును ఆపారు.ఇదంతా ఉంహించని పైన ఉన్న వ్యక్తులు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వారంతా ఒక్కసారిగా కిందకు పడ్డారు.దీంతో వారికీ చిన్నపాటి గాయాలయ్యాయి.ఈ వీడియోను పోలీస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.ఇలా బస్సు పైకి ఎక్కి ప్రయాణాలు చేయడం చాలా ప్రమాదమని అలా చేయవద్దని తెలిపారు.