బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త హిందీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.ఈమె మోడల్ రంగంలో మిస్ ఇండియా యూనివర్స్ గా 2005లో పేరు సంపాదించుకుంది.
ఈమె తన తొలి సారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోగా.ఆ తరువాత వరుస సినిమాలలో నటించింది.తక్కువ సమయంలోనే తన నటనతో, అందంతో మంచి పేరు సొంతం చేసుకుంది.
2005లో ఆశిక్ బనాయా ఆప్నే అనే హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన తనుశ్రీ.తొలిసారి నటనతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా 2006లో వీరభద్ర సినిమా కు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ.ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ లోనే ఉండిపోయింది.2007లో స్పీడ్ సినిమాలో చివరిసారిగా నటించగా ఆ తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించలేదు.తాజాగా ఆమె నోటి నుండి ఒంటరిగానే ఉండాలనుకుంటున్నా అనే మాట వినిపించింది.
శుక్రవారం తను శ్రీ దత్త 37వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.ఈ విధంగా ఇటీవలే ఆమె విదేశాల నుంచి ముంబైకి రాగా.దాదాపు 11 సంవత్సరాల తర్వాత సినీ పరిశ్రమకు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె కొన్ని విషయాలు మాట్లాడుతూ.ఆమెకు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం మొదటినుంచి అంతగా ఇష్టం ఉండేదట.
ప్రతిరోజు తాను ఎలా గడుపుతాదో.తన పుట్టినరోజు కూడా అలాగే ఉంటుందట.
నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉండాలనుకుంటున్నా అనే విషయాన్ని తెలిపింది.ఇక యోగ, ధ్యానంతో సమయం గడపాలని అనుకుంటుందట.
ఇక ఈ ప్రపంచంలో ప్రతిదీ అస్థిరమైనదనే అర్థమైందని తెలిపింది.స్థితిగతులను బట్టి ఎదుటివారు ప్రవర్తనలో మార్పులు ఉంటాయని, కొన్నిసార్లు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారని చెప్పుకొచ్చింది.
ఇక తన పుట్టిన రోజుకి అందరూ ఉండాలనుకుంటున్నారట.కానీ ఓ సమయంలో ఎవరు లేక ఒంటరిగానే ఉన్నానని తెలిపింది.
తను ఏమీ లేని స్థితి నుంచి ఈ స్థాయికి ఎదిగాననంటూ, తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ప్రతి శుక్రవారం ధ్యానం చేస్తానని తెలిపింది.