ప్రస్తుత కాలంలో కొంతమందికి సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి టిక్ టాక్ ఓ వ్యసనంగా మారింది.ఇందులో భాగంగా టిక్ టాక్ కి బానిసలైనటువంటి కొందరు సమయం, సందర్భం గురించి ఆలోచించకుండా టిక్ టాక్ వీడియోలు చేస్తూ నవ్వులపాలు అవుతున్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను తాము నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పరిమితం కావాలంటూ ప్రభుత్వ అధికారులు సూచించారు.
దీంతో కొందరు బుద్ధిగా ప్రభుత్వ అధికారులు చెప్పిన మాట వింటూ ఇంటికే పరిమితమయ్యారు.మరికొందరు మాత్రం అధికారుల మాటలను బేఖాతరు చేయకుండా బయటకి వస్తూ నిర్మానుష్య ప్రదేశాలలో వీడియోలు తీసుకుంటూ టిక్ టాక్ లో పోస్ట్ చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలో కొందరు పోలీసులకు దొరుకు తున్నారు.దీంతో అధికారుల మాటలు లెక్క చేయకుండా ఇలా బయటకు వచ్చి టిక్ టాక్ వీడియోలు చేస్తూ దొరికిపోయిన వారిని తుక్కు రేగ్గొడుతున్నారు.
ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో పలు వీడియోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వ అధికారులు కూడా దయచేసి అత్యవసర సమయాల్లో తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ ప్రజలను వేడుకుంటున్నారు.
అయినప్పటికీ జనాలు మాత్రం బయట సంచరిస్తూనే ఉన్నారు.దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది.