అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.ఇక ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత జనాల సెల్ఫీ మోజుకి ప్రమాదాలు కూడా కనిపించడం లేదు.
ప్రమాదాలు జరిగిన కనీసం రక్షించే ప్రయత్నం చేయకుండా సెల్ఫీలు తీసుకోవడం సరదాగా మారిపోయింది.తాజాగా విజయవాడలో రామవరప్పాడు ఇన్నర్ రింగ్రోడ్డుపై ఓ కారు సినీ ఫక్కీలో ఎగిరి ఫుట్పాత్పై నుంచి రిటైనింగ్ వాల్ ఎక్కి ఆగింది.
కారు వంతెనపై నుంచి వేలాడుతుండటంతో స్థానికులు సినిమా సెట్టింగ్గా భావించి ఫోన్ లో సెల్ఫీలు తీసుకోవడం వారి వంతయ్యింది.
అయితే ఈ ఘటనలో చివరికి పోలీసులు వస్తే గానీ జరిగింది యాక్సిడెంట్ అనే విషయం తెలియలేదు.
అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఈ ఘటన గుణదల ఫ్లైఓవర్ పై జరిగింది.
ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కొత్త కారును రామవరప్పాడు ఇన్నర్రింగ్ రోడ్డు మీదుగా ఇంటికి తీసుకెళ్తూ ఉండగా రైల్వే వంతెనపై ఆటో అడ్డంగా దానిని తప్పించేందుకు డ్రైవరు ఎడమవైపు తిప్పాడు.బ్రేక్పై వేయాల్సిన కాలును ఎక్స్లేటర్పై వేయడంతో వేగంగా కాలిబాట మీదుగా రిటైనింగ్ వాల్పైకి ఎక్కేసింది.
వెనక చక్రాలు వంతెన పక్కగోడపై వేలాడుతుండగా ముందుచక్రాలు ఫుట్పాత్పై ఉన్నాయి.ఇదంతా సినిమా షూటింగ్ అని భావించిన ప్రజలు కారు దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు.