రాష్ట్రాన్ని పాలించే పాలకులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి కానీ వారి వల్లే ప్రజలకు కష్టాలు వస్తే పట్టించుకునే నాధుడెవ్వరు అనే ప్రశ్న తాజాగా ఓ గ్రామ ప్రజల హృదయాల్లో ఉదయించిందట.ఆ వివరాలు చూస్తే.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.అయితే సీయం వస్తున్నారంటే హడావుడి ఉండటం మామూలే కదా.
కానీ ఇక్కడి అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు.అదేమంటే ముఖ్యమంత్రి వస్తున్న హెలిక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సరైన ప్రదేశం అక్కడ లేకపోవడంతో హడావుడి పడిన అధికారులు కాళేశ్వరం సమీపంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్కో ఆధికారులు గతంలో అమర్చిన ఈ విద్యుత్ స్తంబాలను హెలిక్యాప్టర్ ల్యాండింగ్కు అడ్దుగా ఉన్నాయని భావించి హుటాహుటిన మంగళవారం ఉదయం కూల్చి వేయించారట.
దీంతో అన్నారం, చండ్రుపల్లి, నాగెపల్లి, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం, కాళేశ్వరంలోని దుబ్బగూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందట.ఇలా కరెంటు పోళ్లను తొలగించడంతో తాము చీకట్లో మగ్గాల్సిన పరిస్దితులు ఏర్పడ్డాయని ఈ ఆరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.