ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఎఫెక్ట్ కన్నడ సెలబ్రిటీ కపుల్ పై పడింది.దీనితో వారిని రావద్దు అంటూ పలు సంఘాల నేతలు ఆందోళనలకు దిగుతున్నారు.
వివరాల్లోకి వెళితే… కన్నడ గాయకుడూ చందన్ శెట్టి ఇటీవల మైసూర్ కు చెందిన నివేదితా గౌడ ను పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి అయిన ఆనందంలో భార్య ను హనీమూన్ కు తీసుకువెళ్లాలని ప్లాన్ చేసుకున్న చందన్ భార్య నివేదితా తో కలిసి ఇటలీ కి వెళ్ళాడు.
అయితే ఇటీవల అక్కడ ఇటలీ లో కరోనా మరణాలు శృతి మించడం తో తమ హనీమూన్ ను కూడా పక్కన పెట్టి అర్ధాంతరంగా తమవిహార యాత్రను రద్దు చేసుకొని తిరిగి ఇండియాకు బయలుదేరారు.అయితే అక్కడ కరోనా ప్రబలుతోంది అని స్వదేశానికి రావడానికి వారు చూస్తుంటే అసలు వారిని మైసూర్ లో అడుగుపెట్టనివ్వకూడదు అంటూ పలు సంఘాల నేతలు కలెక్టర్ ను కలిసి మరి అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఇంతవరకు మైసూర్ లో ఈ కరోనా కేసులు నమోదు కాలేదని,వారిద్దరిని నగరంలోకి రానివ్వొద్దు అంటూ కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.
ఒకవేళ వారిని మైసూర్ లోకి అడుగుపెట్టనిస్తే ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందే అని, సామాన్యులను చూస్తున్నట్లుగానే 14 రోజుల పాటు అబ్జార్వేషన్ లో ఉంచాలి అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు.ఈ ప్రక్రియ మొత్తం జరిగిన తరువాతే వారిని తిరిగి మైసూర్ లోకి అనుమతించాలి అంటూ సంఘాల నేతలు స్పష్టం చేశారు.మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.