మన దేశంలో నదులను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.పూజలు చేస్తుంటారు.
పవిత్ర నదుల నీటిని పూజలు, శుభకార్యాల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.అయితే దీనికి విరుద్దంగా ఉత్తరప్రదేశ్లోని కర్మనాశ అనే నది నీటిని ఇక్కడివారు అస్సలు ముట్టుకోరు.
కర్మనాశ అనేది రెండు పదాలతో రూపొందింది.మొదటి కర్మ మరియు రెండవ నాశ.కర్మనాశ నది నీటిని తాకడం వల్ల పనులు నాశనం అవుతాయని, మంచి పనులు కూడా మట్టిలో కలిసిపోతాయని స్థానికులు నమ్ముతారు.అందుకే ఇక్కడివారు ఈ నది నీటిని ఎప్పుడూ ముట్టుకోరు.
అలాగే దేనికీ ఉపయోగించరు.కర్మనాశ నది బీహార్, ఉత్తర ప్రదేశ్ల గుండా ప్రవహిస్తుంది.
ఈ నదిలో ఎక్కువ భాగం యూపీలోనే వస్తుంది.యూపీలోని సోన్భద్ర, చందౌలీ, వారణాసి, ఘాజీపూర్ గుండా ప్రవహించి బక్సర్ దగ్గర గంగానదిలో కలుస్తుంది.
ఎంతటి నీటి అవసరాలున్నా ఈ నది నీటిని స్థానికులు ఉపయోగించకపోవడం విశేషం.కర్మనాశ నది చివరికి గంగానదిలో కలుస్తుంది.
పురాణాల ప్రకారం, హరిశ్చంద్ర రాజుకు తండ్రి అయిన సత్యవ్రతుడు ఒకసారి తన గురువైన వశిష్ఠ దగ్గర తనకు స్వర్గానికి వెళ్లాలనే కోరిక ఉందని తెలిపాడు.అందుకు గురువు నిరాకరించాడు.
దీంతో సత్యవ్రతుడు విశ్వామిత్రుని ముందు తన కోరిక వ్యక్తం చేశాడు.వశిష్ఠునితో శత్రుత్వం కారణంగా విశ్వామిత్రుడు తన శక్తియుక్తులతో సత్యవ్రతుడిని శారీరంతోనే స్వర్గానికి పంపాడు.
అది చూసిన ఇంద్రుడు కోపోద్రిక్తుడై సత్యవ్రతుడిని తిరిగి భూలోకానికి పంపాడు.అయితే విశ్వామిత్రుడు తన తపస్సుతో రాజును స్వర్గానికి, భూమికి మధ్య నిలిపి, దేవతలతో యుద్ధం చేశాడు.
ఈ సమయంలో సత్యవ్రతుడు ఆకాశంలో తలకిందులుగా వేలాడుతున్నాడు.దాని కారణంగా అతని నోటి నుండి లాలాజలం రావడం ప్రారంభమైంది.
ఈ లాలాజలం నది రూపంలో భూమిపై పడింది.అదే కర్మనాశ నదిగా మారిందని చెబుతారు.
లాలాజలంతో నదిని సృష్టించడం, వశిష్ఠుని శాపం కారణంగా ఈ నది శాపగ్రస్తమైనదిగా పరిగణిస్తారు.