ఏంటీ ఘోరం, దీనిని ఘోరాతిఘోరం అని అనాలేమో.రాజస్థాన్ బికనీర్ లో జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది.
కొందరు మానవ మృగాలు అన్నెం పున్నెం ఎరుగని సాధు జంతువు ఒంటెను అతి కిరాతకంగా చంపేశారు.ఆ జంతువు తెలియక చేసిన ఓ తప్పుకు మానవులే జంతువులుగా మారిన వైనం ఇక్కడ చూడవచ్చు.
అక్కడి గ్రామస్తులంతా కలిసి ఒంటెను చనిపోయే దాకా కర్రలతో చితకబాది మరీ చంపారు.ఇంతకీ ఒంటె చేసిన నేరం ఏమిటంటే.
ఒంటె తన యజమానిని చంపడమే.
అవును, వివరాల్లోకి వెళితే, బికనీర్ జిల్లా నోఖా పట్టణంలోని పంచు గ్రామంలో ఒంటె యజమాని అయినటువంటి 45 ఏళ్ల సోహన్ రామ్ నాయక్ ఒంటెల బండితో గ్రామానికి చేరుకున్నాడు.ఆ తరువాత ఒంటెను పొలానికి తీసుకెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న సోహాన్ రామ్ నాయక్ మెడపై ఒంటి గట్టిగా కొరింది.దీంతో తీవ్ర రక్త స్రావం అయి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా 20 రోజుల క్రితమే సోహన్ రామ్ సదరు ఒంటెను కొనుగోలు చేసినట్లు అతని బంధువులు చెబుతున్నారు.మృతుడు సోహన్రామ్కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చంపిన వాళ్లలో వారు కూడా వున్నారు.అలా దానిని ఎందుకు చంపారు అని స్థానికులు వారిని ప్రశ్నించగా ఒంటె బతికి ఉంటే మరింతమందికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే చంపినట్లు వారు వెల్లడించారు.అయితే ఈ విషయం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.అందులో వారు ఒంటెను చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టి చంపడం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే దీనిపైన నెటిజన్లు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు.కారణం ఏదైనా అలా దానిని చంపడం చాలా ఘోరం అని అంటున్నారు.
కొంతమంది ఆ యజమాని కుటుంబ సభ్యులకు సానుభూతి చెబుతున్నారు.