సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా పెంగ్విన్.కార్తిక్ సుబ్బరాజు నిర్మాణం లో తమిళంలో తెరకెక్కిన ఈ లేడీ ఒరియాంటెడ్ సినిమా ఈ నెల 19 అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
తెలుగు, తమిళ్, మలయాళీ బాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఇక కీర్తి కెరియర్ మహానటి తర్వాత చేస్తున్న లేడీ ఒరియాంటెడ్ సినిమా ఇదే కావడం విశేషం.
ఇక ఇందులో కీర్తి సురేష్ ఒక ఐదేళ్ళ బాబుకి తల్లిగా నటిస్తుంది.తప్పిపోయిన తన కొడుకుని వెతుక్కునే పరిస్థితిలో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే ఎలిమెంట్ తో సినిమా కథ నడవబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ అన్ని భాషలలో రిలీజ్ అయ్యింది.ఇక ఈ ట్రైలర్ కి స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
లేడీ ఒరియాంటెడ్ సినిమా అయిన కూడా ఏకంగా 30 మిలియన్ డిజిటల్ వ్యూస్ ఈ ట్రైలర్ సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని చిత్ర యోనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇంత తక్కువ టైంలో ఇన్ని మిలియన్ వ్యూస్ అంటే కచ్చితంగా అది కీర్తి సురేష్ కి ఉన్న క్రేజ్ కారణంగానే వచ్చాయని చెప్పాలి.మరి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
మరో వైపు తెలుగులో కీర్తి చేసిన లేడీ ఒరియాంటెడ్ మిస్ ఇండియా కూడా పెంగ్విన్ కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఒటీటీలో రిలీజ్ చేయాలా లేదంటే థియేటర్స్ కి వెళ్ళాల అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.